మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరం: పురందేశ్వరి

73చూసినవారు
మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరం: పురందేశ్వరి
విజయవాడలో మంగళవారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరై మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కలయిక చారిత్రక అవసరమని పురందేశ్వరి అన్నారు. టీడీపీతో కలిసి వెళ్లాలనేది పార్టీ పెద్దల నిర్ణయమని ఆమె తెలిపారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయించామని, పొత్తుల వల్ల కొంత మంది ఆశావహులకు నిరాశ ఎదురైందన్నారు.

సంబంధిత పోస్ట్