విశాఖ డ్రగ్స్ కేసుపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. ప్రొద్దుటూరు వేదికగా జరుగుతోన్న సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. "చంద్రబాబు వదినగారి చుట్టం కంపెనీలో డ్రైఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే CBI దాడులు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీకి డైరెక్టర్లు. వారు చంద్రబాబు బంధువులు. నేరం చేసింది వారు.. తోసేది మన మీదికి." అని విమర్శించారు.