ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్బంగా రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై గొడవ చేయాలని, అలాగే ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయాలని కూడా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది.