జగన్ అండతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రజలను భయపెట్టారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ శుక్రవారం ఆరోపించారు. చిత్తూరులోని టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ. పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని పల్నాడులో అరాచకాలు, విధ్వంసాలు, హత్యలు చేశారని మండిపడ్డారు.