నిండ్ర మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

74చూసినవారు
నిండ్ర మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
నిండ్ర మండలంలో బుధవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు కావునూరు గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్