బ్ర‌హ్మోత్స‌వాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

62చూసినవారు
బ్ర‌హ్మోత్స‌వాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. సాయంత్రం 6. 30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. శ్రీవిష్వ‌క్సేనుల‌వారు నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌తీతి. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్