చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో సెట్విన్, యువజన సర్వీసుల శాఖ వారు నిర్వహించిన జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలలో నగరి ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరచినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. జానపదం గ్రూప్ డాన్స్లో మేఘన, విజయలక్ష్మి, విశాలాక్షి, ఉపన్యాస పోటీల్లో హేమావతి సెట్విన్ సీఈవో డాక్టర్ మురళీకృష్ణ చేతుల మీదుగా అవార్డులు గురువారం అందుకున్నారన్నారు.