పలమనేరు మార్కెట్ యార్డులో టమోటా ధర శనివారం స్వల్పంగా పెరిగింది. ఈ నెల 12వ తేదీ కిలో రూ. 50 పలుకగా 13న గరిష్టంగా రూ. 54 పలికింది. వర్షాల కారణంగా తోటల్లో టమోటాలు దెబ్బతింటుండటంతో ధర పెరిగినట్లు తెలుస్తోంది. పుంగనూరు మార్కెట్లో గరిష్టంగా రూ. 53, మదనపల్లెలో మొదటి రకం గరిష్టంగా రూ. 64 పలికింది. ధర పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.