ఈనెల 9న పుంగనూరుకు రానున్న జగన్

84చూసినవారు
చిత్తూరు జిల్లా , పుంగనూరు పట్టణంలో చిన్నారి అస్పియా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ ఈనెల 9వ తేదీన పుంగనూరు పట్టణానికి వస్తారని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి శుక్రవారం తెలిపారు. చిన్నారి మృతికి సంతాపం తెలిపేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ద్వారకనాథ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్