సత్యవేడు: శ్రీసిటీ లో రోడ్డు ప్రమాదం

51చూసినవారు
సత్యవేడు శ్రీసిటీలోని జడ్. టీ. టీ కంపెనీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సత్యవేడు మండలం ఆరూరు గ్రామం నుండి టాటా ఏస్ కంపెనీ ఉద్యోగులను తీసుకొని వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవరు, ఓ మహిళకు గాయాలు కాగా స్థానికులు దినేష్ చిన్న పాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్