ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి

50చూసినవారు
ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి
కాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నదిలో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కార్వేటి నగరానికి చెందిన చంద్రశేఖర్ శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళాడు. ఈ తరుణంలోనే స్వర్ణముఖి నదిలో స్నానం చేయడానికి కైలాస గంగా స్నాన ఘట్టానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి మృతి చెందాడు. అయితే స్నాన ఘట్టం వద్ద నది లోతుగా ఉండడంతో భక్తుడు మరణించినట్లు స్థానికులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్