ఇచ్చిన హామీ నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

82చూసినవారు
ఎన్నికల ముందు పింఛను లబ్ధిదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని దొరవారిసత్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు అన్నారు. సోమవారం సింగనాలత్తూరులో నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జూలై ఒకటో తేదీన రూ. 7 వేలు అందించడం జరిగిందని తెలిపారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్