అస్వస్థతకు గురైన విద్యార్థులకు మాజీ ఎంపీ నెలవల పరామర్శ

51చూసినవారు
నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆదివారం రాత్రి అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్