నైరుతి రుతుపవనాల రాకతో గూడూరు పరిసరాల్లో సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకుని ఉష్ణోగ్రత 28 డిగ్రీలకు పడిపోయింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. తట్టుకోలేని ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిన ప్రజలు చల్లని వాతావరణంతో సేద తీరారు. ఉదయం నుంచి ఆకాశంలో కారు మేఘాలు కమ్ముకున్నా. చినుకు పడలేదు. దీంతో అన్నదాతలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.