ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు

83చూసినవారు
వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలోని 194, 195 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్