తీవ్ర విషాదం.. స్కూల్‌లో విద్యార్థి మృతి

80చూసినవారు
నెల్లూరులోని కేఎన్‌ఆర్ హైస్కూలులో సన్‌-సైడ్ కూలి తొమ్మిదోవ తరగతి విద్యార్థి మహేష్(14) మృతి చెందాడు. ఆడుకుంటున్న విద్యార్థిపై అది కూలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. స్కూలులో నాడు-నేడు పనులు నాసిరకంగా ఉండటంతోనే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు. నిర్మాణ పనులపై విచారణకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్