వైసీపీ పాలనలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును చంపేందుకు యత్నించారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి.రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. 'సీఐడీ ఆఫీస్కు వెళ్లిన వ్యక్తి నడవలేని స్థితిలో వచ్చారు. ఆయన కాళ్లను తాళ్లతో కట్టారు. తప్పుడు నివేదిక ఇచ్చిన జీజీహెచ్ వైద్యులు నిందితులే. ఈ కేసులో ఇప్పటి వరకు 27 మందిని విచారించాం' అని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.