గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో పబ్లిక్ పాలసీ కోర్సు పూర్తి చేసి పట్టా అందుకున్నారు. ప్రజా ప్రతినిధిగా కొనసాగుతూ ఈ ఘనత సాధించిన తొలి రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. కఠినమైన రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలోనూ అర్హత సాధించి 40 శాతం స్కాలర్షిప్తో ఆయన ఐఎస్బీలో సీటు సాధించారు. 12 నెలల పాటు 26 కోర్ సబ్జెక్టులను అధ్యయనం చేసి కోర్సు పూర్తి చేశారు.