గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామంలో మంగళవారం జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఏపీవో సిహెచ్ రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా వేతన దారుల మస్తర్లను తనిఖీ చేశారు. అడిగిన వారందరికీ పనులు కల్పించాలన్నారు. కొలతల ప్రకారం పనులు చేసుకోవాలన్నారు. ఎండల తీవ్రత వలన రెండు పూటలా పనిచేయాలని సూచించారు.