భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. వాతావరణ శాఖ హెచ్చరించిన విధంగానే మంగళవారం గజపతినగరంలో హీట్ వేవ్స్ కనిపించాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. రానున్న రెండు నెలల్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్చి ఆరంభంలోనే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రహదారులపై ప్రయాణించాలంటేనే జనం భయపడుతున్నారు.