వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని అన్నారు. తమ పార్టీ ప్రజా సంక్షేమమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు.