ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత

77చూసినవారు
ఎన్డీయే కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. మండలంలోని కొండవెలగాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థి కిట్లను ఎమ్మెల్యే శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన 28, 712 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా విద్యార్థి కిట్లు అందజేస్తోందని చెప్పారు.

సంబంధిత పోస్ట్