హనుమజ్జయంతి సందర్భంగా రాజాం లోని పలు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో స్వామివారికి శనివారం విశేష పూజలు జరిగాయి. ఆయా దేవాలయాల అర్చకులు స్వామివారిని అష్టోత్తర శతనామావళితో పూజలను నిర్వహించారు. స్వామివారి మెడలో తమలపాకుల దండలు మరియు నిమ్మకాయల దండలను అలంకరించి గంధసిందూరంతో పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల గోత్రనామాలతో పూజలు చేసిన అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.