పాముకాటు బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

75చూసినవారు
ఎల్ కోట మండలం కొట్ట్యాడకు చెందిన మాజీ ఎంపీటీసీ ఎం. రామారావు పాము కాటుకు గురై ఎస్. కోట పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం రామారావుకు మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని వైద్యులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ కోట మండల పార్టీ అధ్యక్షులు జి ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్