సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

81చూసినవారు
సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం
స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం మండల 12వ సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీడీవో ఈశ్వరమ్మ సభను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో విద్యాశాఖ పనితీరు అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా ఉందని సభ్యులు మూకుమ్మడిగా ద్వజమెత్తారు. విద్యావ్యవస్థను మెరుగుపరచాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్