విద్యుత్ వైర్ తెగి వ్యక్తి మృతి

63చూసినవారు
విద్యుత్ వైర్ తెగి వ్యక్తి మృతి
తెర్లాం మండలములోని అంట్లవార గ్రామంలో బుధవారం సాయంత్రం పొలములో తెగిన విద్యుత్ తీగలు కాలికి తగిలి గ్రామానికి చెందిన రైతు కోట రామారావు(48) అక్కడికక్కడే చనిపోయాడు. ఈయనకు భార్య చిన్నమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై బి సాగర్ బాబు పరిశీలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్