28న భగత్ సింగ్ జయంతి వేడుకలు

75చూసినవారు
28న భగత్ సింగ్ జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఆ కరపత్రాలను శుక్రవారం బొబ్బిలిలోని పూల్బాగ్ లో ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత వేణు చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ విద్యార్థుల పట్ల సమాజం పట్ల మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్