బొబ్బిలి: నిత్యావసర సరుకులు అందజేత

80చూసినవారు
బొబ్బిలి: నిత్యావసర సరుకులు అందజేత
ప్రతీరోజు వృద్ధులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకులు బి. లక్ష్మి శంకర రావు. ఈ సందర్భంగా శనివారం వారికి మహాత్మ జ్యోతిరావ్ పూలే రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోత్తం, పాఠశాల సిబ్బంది నిత్యావసర సరుకులను కోమటిపల్లిలో అందచేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మి శంకర రావు మాట్లాడుతూ.. అన్నపూర్ణ ఆపన్న హస్తం ద్వారా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన సహాయాన్ని అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్