కొండదేవుపల్లిలో విద్యుదాఘాతంతో రైతు మృతి

66చూసినవారు
కొండదేవుపల్లిలో విద్యుదాఘాతంతో రైతు మృతి
బొబ్బిలి మండలం కొండదేవుపల్లి గ్రామానికి చెందిన రైతు రాగోలు కృష్ణ (55) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పొలంలో వరి పంటను చూసేందుకు మంగళవారం ఐరన్‌ కస్తా బొరిగి భుజంపై పెట్టుకుని వెళ్తుండగా పొలంలో విద్యుత్‌ వైర్లు కిందకు వేలాడడంతో ఆ బొరిగికి వైర్లు తగలడంతో షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ పెద్దదిక్కు మరణించడంతో భార్య లక్ష్మి, పిల్లలు, కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్