ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రిటర్నింగ్ అధికారి ఎ. సాయిశ్రీ హెచ్చరించారు. తన కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల కోడ్ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే కంట్రోల్ రూమ్కు పిర్యాదు చేస్తే వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.