ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం

61చూసినవారు
విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందక తన తండ్రి మృతి చెందినట్లు మృతుని కుమార్తె తెలిపారు. గుండె నొప్పితో ఆస్పత్రికి తీసుకువస్తే వైద్యులు సకాలంలో పట్టించుకోలేదని ఆరోపించారు. గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్