పాఠశాలలో ప్రవేశానికి వినూత్న ప్రచారం

64చూసినవారు
పాఠశాలలో ప్రవేశానికి వినూత్న ప్రచారం
తమ పాఠశాలలో ప్రవేశాల శాతాన్ని పెంచేందుకు గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. హెచ్. రమేష్ కుమార్ శుక్రవారం వినూత్న ప్రచారాన్ని నిర్వహించారు. తమ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో సాధించిన పదవ తరగతి ఫలితాలను ఆటో ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ ప్రచార రథాన్ని ఎంఈఓ లు విమలమ్మ సాయి చక్రధర్ లు ప్రారంభించారు. విద్యార్థులతో ప్రచార రథం వెనుక భారీ ర్యాలీ చేపట్టారు.

సంబంధిత పోస్ట్