టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ శనివారం తలపడనున్నాయి. ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒక మ్యాచ్లో గెలిచిన భారత్ ఈమ్యాచ్లోనూ గెలిస్తే నేరుగా సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోనుంది. భారత్ను కోహ్లి, రోహిత్, దూబే, జడేజా ఫామ్ కలవరపరుస్తోంది. నేటి మ్యాచ్లో దూబే స్థానంలో జైశ్వాల్ లేదా సంజూకు చోటివ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.