సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

51చూసినవారు
సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని దత్తిరాజేరు ఎంపీపీ గేదల సింహాద్రి అప్పలనాయుడు, జడ్పిటిసి రౌతు రాజేశ్వరిలు కోరారు. గురువారం దత్తిరాజేరు మండలంలోని కన్నాం గ్రామంలో గ్రామసందర్శన కార్యక్రమం జరిగింది. పంచాయతీ కార్యాలయానికి, అంగన్వాడికి భవనాలు నిర్మించాలని, స్మశాన వాటికతో రహదారి నిర్మించాలని ప్రజలు కోరారు. మండల ప్రత్యేక అధికారి నూకరాజు, ఎంపీడీవో చంద్రకుమారి, తహసిల్దార్ సుదర్శన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్