ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామాలకు చేరుకున్న ఏనుగుల గుంపు

80చూసినవారు
పార్వతీపురం మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామాలకు చేరుకున్న ఏనుగుల గుంపు, రైతులకు తీవ్ర పంట నష్టం కలిగిస్తున్నాయి. అర్ద రాత్రి రావికోన పంచాయితీ రంగాలగూడ తోటల్లో తలదాచుకున్న ఈ ఏనుగులు శుక్రవారం నాటికి సంఘంవలస పంచాయతీ సీతంపేట మీదుగా తానవలస సమీపాన ఉండటం ప్రారంభించాయి. ఈ ఏనుగులు పలు గిరిజన గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పంటలను పూర్తిగా నాశనం చేశాయి, దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్