బాలా త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు

73చూసినవారు
బాలా త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు
దసరా నవరాత్రుల సందర్భంగా కురుపాం రావాడ రోడ్డు సమీపంలో గల శ్రీ కోట దుర్గ అమ్మవారి ఆలయంలో సంబరాలు ఘనంగా చేపడుతున్నారు. నవరాత్రులలో భాగంగా రెండవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్