పెదమేరంగి: హత్యాయత్నం కేసులో నిందితునికి ఏడేళ్ల శిక్ష

78చూసినవారు
పెదమేరంగి: హత్యాయత్నం కేసులో నిందితునికి ఏడేళ్ల శిక్ష
జియ్యమ్మవలస మండలంలో 2019లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితునికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎస్‌. అరుణ తీర్పునిచ్చారు. పెదమేరంగి గ్రామానికి చెందిన పల్లా దుర్గారావును అదే గ్రామానికి చెందిన బంటు లోకనాథం అలియాస్‌ నాని పాతకక్షల కారణంగా గాయపర్చాడని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చినమేరంగి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ శివప్రసాద్‌ కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్