సచివాలయ సిబ్బందితో గ్రామ సభలపై సమీక్ష

84చూసినవారు
సచివాలయ సిబ్బందితో గ్రామ సభలపై సమీక్ష
గుమ్మలక్ష్మీపురం ఎంపిడిఓ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయాల సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 23 శుక్రవారం గ్రామ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సచివాలయ సిబ్బంది నిర్వహించాల్సిన విధి విధానాలపై ముందస్తుగా ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మండలంలో ఉన్న సచివాలయ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్