గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట పిటిజి సమీపంలో గల మలుపు వద్ద అదుపుతప్పి లోడ్ తో వెళ్తున్న వ్యాన్ సోమవారం బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు కాలు, చేయి విరివిపోయి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి నుండి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.