ఎస్ కోట: గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కోఆర్డినేటర్

74చూసినవారు
ఎస్ కోట: గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కోఆర్డినేటర్
వేపాడ మండలం బక్కునాయుడుపేట లో గల గురుకుల పాఠశాలను బుధవారం జిల్లా కో ఆర్డినేటర్ టిఎంసి ఫ్లోరెన్స్ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. ఈ నెల 18 న నెల్లిమర్లలో జరగనున్న సైన్స్ ఫైర్ కు విద్యార్థులు తయారుచేసిన పలు రకాల ప్రాజెక్టులతో హాజరు కావాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి, సక్రమంగా మెనూ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్