జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవిని గెలిపించాలని మాజీ ఎఎంసి చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ మూర్తి వెల్లడించారు. భోగాపురం మండలం రావాడలో జనసేన-టిడిపి-బిజెపి నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సూర్యనారాయణ మూర్తితో సహ వైసిపి నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, కూటమి అభ్యర్థి లోకం మాధవి హాజరయ్యారు. ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు జనసేన-టిడిపి-బిజెపి సైనికుల్లా పనిచేయాలని కోరారు.