సమస్యలు పరిష్కరించాలని మిమ్స్ ఉద్యోగుల ర్యాలీ

75చూసినవారు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మిమ్స్ ఉద్యోగులు నెల్లిమర్ల మొయిద జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ గత 52 రోజులుగా మిమ్స్ ఉద్యోగులు పోరాటం చేస్తున్నా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. పైగా లేబరు అధికారులు ఉద్యోగులపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్