పాలకొండ మండలం నవగాం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి ఎన్నికల ప్రచారం చేపట్టారు. గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అందించిన నవరత్నాల పథకాలు, క్షేత్రస్థాయిలో కల్పించిన మౌలిక సదుపాయాలను ప్రజలకు వివరించారు. ప్రతిపక్షం నాయకుల పొంతన లేని మాటలు, హామీలు ఎవరు నమ్మవద్దని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో మద్దతు పలకాలని కోరారు.