ఉత్తరఖండ్లోని రాంనగర్ సమీపంలో ఉండే గర్జియా మాత ఆలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో దుకాణాలు దగ్ధమయ్యాయి. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆలయం కోసి నది ఒడ్డున ఉంది. మ్యాగీ టీ కియోస్క్లోని స్టవ్ నుంచి మంటలు లేచి పైన అమర్చిన టార్పాలిన్కు మంటలు వ్యాపించినట్లు అక్కడి స్థానికులు భావిస్తున్నారు.