కర్ణాటక హాసన్ జిల్లాలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. సకలేష్పూర్ తాలూకాలోని కొల్లహళ్లి గ్రామంలో నవీన్ (21) అనే యువకుడు కొబ్బరి చెట్టు ఎక్కాడు. అయితే ఎండ వేడిమికి చెట్టుపైనే స్పృహ కోల్పోయాడు. 45 నిమిషాల పాటు చెట్టుకు వేలాడాడు. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న ఆ యువకుడిని అతికష్టం మీద రక్షించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు.