భారీ వాహనాల రాకతో ఆందోళన చెందుతున్న ప్రజలు

64చూసినవారు
వీరఘట్టం మీదుగా భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బుధవారం తాజాగా వీరఘట్టం-పార్వతీపురం మధ్యలో ఓ ఆయిల్ ట్యాంకర్ 33 కెవీ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి పొలాల్లొ బోల్తా పడింది. ప్రమాద సమయంలో విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీస్, రవాణా శాఖ అధికారులు స్పందించి అతివేగంగా వస్తున్న భారీ వాహనాలపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.