పార్వతీపురం మండలం డోకిశిల రెవెన్యూలో శనివారం అనుమతుల్లేకుండా గిరిజనులు భూములపై రహదారుల పనులు వేయడంతో గ్రామస్తులతో పాటు సిపిఎం నాయకులు పి. రాము ఆధ్వర్యంలో పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోకిశీల రెవెన్యూలోని తేలునాయుడువలసకు చెందిన కొంతమంది పేదల భూములపై శనివారం యంత్రాలతో గుర్తు తెలియని వ్యక్తులు రహదారి పనులు ప్రారంభించారని, ఈ పనులకు అనుమతులు ఎవరు ఇచ్చారని అడిగారు.