రాజాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలె రాజేష్ నామినేషన్ కు రాజాం నాలుగు మండలాల నుంచి అశేషముగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
బుధవారం అట్టహాసంగా డాక్టర్ రాజేష్ నామినేషన్ వేశారు. పోలిపల్లి పైడితల్లమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. డాక్టర్ రాజేష్ తో పాటు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ ఎమ్మెల్సీ విక్రాంత్ పాల్గొన్నారు.