ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు అయిన కోటక్ మహీంద్రా బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. డేటా సెక్యూరిటీకి సంబంధించి సమస్యలను సమగ్రంగా, సకాలంలో పరిష్కరించకపోవడంతో 35A సెక్షన్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం ఆ బ్యాంకుపై చర్యలు తీసుకుంది. మొబైల్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను సైతం జారీ చేయొద్దని పేర్కొంది.