ఎస్ కోట మండలంలో అనుమతులు లేని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని ఎస్ ఎఫ్ ఐ మండల కార్యదర్శి కే రమేష్ కోలారు. ఈ మేరకు ఆయన మండల కమిటీ సభ్యులు నాగచైతన్య, చరణ్, అను, రత్న, రాములతో కలసి ఎంఈఓ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతూ, అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని అన్నారు. తక్షణమే అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.